40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
27-03-2026 12:22 AM
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు మండుతున్నా యి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. పలుజిల్లాల్లో గురువారం 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 40.4 డిగ్రీలు నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 40.3, నిర్మల్లో 40.3, ఆదిలాబాద్లో 40.2, ములుగు, నల్లగొండ జిల్లాల్లో 40.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.




