02-06-2025 10:58:36 PM
కవర్లను స్వాధీనం చేసుకొని విచారణ జరుగుతున్నాయి..
దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం దేవస్థానంలో శేష వస్త్రాలు అమ్మే కాంట్రాక్టర్ కవర్ల ద్వారా అన్యమత ప్రచారం చేస్తున్నాడని వచ్చిన వార్తలపై దేవస్థానం అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నట్లు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి(Temple Administration Officer L Ramadevi) ఒక ప్రకటనలో తెలిపారు. విషయం తెలియటంతో దేవస్థానం అధికారులు కాంట్రాక్టర్ కి నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలిపారు.
ఆదివారం ఉదయం టెండరుదారుని వద్ద భక్తులు వస్త్రాలు కొనుగోలు చేసిన సందర్భంగా ఒక భక్తుడు ఇచ్చిన పిర్యాదు ప్రకారం సదరు కాంట్రాక్టర్ వద్ద ఉన్న కవర్ల బండిల్స్ నందు పరిశీలిస్తి కేవలం ఒక బండిల్లో 2 కవర్లు మాత్రమే అన్యమతము నకు చెందినవి కలిసి ఉన్నాయని. ఆ కవర్లు స్క్రాప్ లో కొనుగోలు చేసినట్లుగా గుర్తించినట్లు తెలిపారు. వెంటనే స్పందించి, వారి వద్ద ఉన్న మొత్తం కవర్స్ బండిల్స్ ను సీజ్ చేసి, సదరు కాంట్రాక్టర్ వారికి నోటీస్ జారీచేయుట జరిగింది. భవిష్యత్తు లో ఇటువంటి సంఘటనలు జరుగకుండా చూడాలని కాంట్రాక్టర్ ను పిలిచి హెచ్చరించుట జరిగింది. సదరు కాంట్రాక్టర్ ఉద్దేశ్యపూర్వకంగా కానీ, ఎవరి ఒత్తిడితో కానీ చేసినట్లుగా లేదని ఈ సందర్భంగా గమనించుట జరిగిందని ఈవో రమాదేవి తెలిపారు.