03-06-2025 12:00:00 AM
తహసీల్దార్ సతీష్ కుమార్
మందమర్రి, జూన్ 2: మండల పరిధిలోని రైతుల సౌకర్యార్థం 4 నుంచి 19 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మండల తహసీల్దార్ పీ సతీష్కుమార్ తెలిపారు. సోమవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో సతీష్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని గ్రామాల రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే భూ భారతి రెవె న్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు.
4న పొన్నారం, చిర్ర కుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో, 6న వెంకటాపూర్, మామిడి గట్టు గ్రామ పంచాయతీ కార్యాలయంలో, 10న లేమూరు, సారంగపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో, 12న క్యాతనపల్లి ప్రాథమిక పాఠశాలలో, తిమ్మాపూర్ పరిధిలోని బొక్కల గుట్ట రైతు వేదికలో, 16న అమరవాది ప్రాథమిక పాఠశాలలో, అందుగుల పేట గ్రామ పంచాయతీ కార్యాలయం లో, 18న మందమర్రి(వి) ప్రాథమిక పాఠశాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.