24-01-2026 02:28:28 PM
జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అటవీ శాఖ పరిధిలో వివిధ కేసుల్లో జిల్లాలోని అన్ని అటవీ రేంజ్ లలో కలప రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు ఈ నెల 30వ తేదీన క్లోజ్డ్ టెండర్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేలంలో మొత్తం 43 ద్విచక్ర, మూడు, నాలుగు చక్రాల వాహనాలకు టెండర్లు స్వీకరించడం జరుగుతుందని, ఆసక్తి గలవారు 500 రూపాయలు "DISTRICT FOREST OFFICER, KUMRAMBHEEM ASIFABAD" పేరట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో చెల్లింపు అయ్యే విధంగా డి.డి. తీసి కార్యాలయ పనివేళలో జిల్లా అటవీశాఖ కార్యాలయంలో దరఖాస్తు ఫారం పొందాలని తెలిపారు. వాహనాలను యధాస్థితిలో అప్పగించడం జరుగుతుందని, టెండర్ లో ఉన్న వాహనాల వివరాల కోసం జిల్లా కార్యాలయంలో డి.డి.తో సంప్రదించవచ్చని తెలిపారు.