24-01-2026 02:24:53 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): మండలం లోని గుండి గ్రామంలో శనివారం నర్సరీ పనులను సర్పంచ్ జబరి రవీందర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనం పెంచడం, స్థానికంగా మొక్కలను అందుబాటులో ఉంచడం (పల్లె ప్రకృతి వనం/ఉపాధి హామీ పథకం) లక్ష్యంగా ఈ నర్సరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హరీష్,వార్డు సభ్యులు ప్రవీణ్,రాజు,తిరుపతి,సునీత -రావుజీ,మాజీ కో ఆప్షన్ సభ్యుడు గణపతి ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు