14-12-2025 11:42:01 AM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అనుచరులు సౌమ్య, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు చంద్రకళ తరఫున వర్గాలు ఎదురెదురుగా నిలిచాయి. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అనుచరులైన బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో వాగ్వాదం దాడుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.