09-10-2025 12:06:31 AM
వినోద్వర్మ, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘అరి’. దీనికి ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమైన జయశంకర్ వంగ ఈ సినిమాను అరిషడ్వర్గాల ఇతివృత్తంతో తెరకెక్కించారు. ఆర్వీ సినిమాస్
పతాకంపై ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రామిరెడ్డి, డీ శేషురెడ్డి మారంరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏషియన్ సురేశ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జయశంకర్ విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
-మన పురాణాల్లో అరిషడ్వర్గాలను జయించాలని చెప్పారే తప్ప, ఎలా జయించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. నేను ఆ విషయాన్నే చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో కొంత రీసెర్చ్ చేశా. హిమాలయాల్లో కొందరు యోగులను కలిశాను. వారి సలహాలు నా ప్రాజెక్టుకు కొంతవరకు ఉపయోగపడ్డాయి. ఇలాంటి కథల్ని పూర్తిగా సందేశాత్మకంగా కాకుండా ఎంటర్టైనింగ్గా చెప్పాలి. ఆ ప్రయత్నంలో నేను సఫలమయ్యానని అనుకుంటున్నా.
-ఈ సినిమాను తొలుత స్టార్స్తో చేద్దామనుకున్నాను. కానీ, పాత్రల కంటే వారి స్టార్డమ్ రిఫ్లెక్ట్ అవుతుందని ఆ ఆలోచన విరమించుకున్నాను. ఆరు ప్రధాన పాత్రల పర్ఫార్మెన్స్ కీలకం. పాత్రలు మాత్రమే కనిపించేలా అందరూ హావభావాలు పలికించారు.
-అరిషడ్వర్గాల సబ్జెక్ట్ సాధారణ ప్రేక్షకులకు కూడా సులువుగా అర్థమ య్యేలా తెరపై చూపించాం. మల్లా ది, యండమూరి లాంటి రచయిత లు సినిమా చూసి అభినందించారు. వెంకయ్య నాయుడు మోడ రన్ భగవద్గీతలా ఉందన్నారు.
--ఏ సినిమా కూడా ప్రేక్షకులందరికీ యునానమస్గా నచ్చదు. మన దేశంలో పబ్బుల కు వెళ్లేవాళ్లు ఎంత మంది ఉన్నారో, గుడికి వెళ్లేవారు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. అలా ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు ఉన్నవారు మా సినిమాను చూసినా చాలనుకుంటున్నాం.
-హిందీలో పెద్ద హీరో, కన్నడలో మరో స్టార్ ‘అరి’ సినిమా చూశారు. అన్నీ కుదిరితే వారితో ఆ భాషల్లో రీమేక్ చేస్తా. జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో డిసెంబర్ నుంచి ఆ మూవీ షూటింగ్కు వెళ్తున్నాం.