13 June, 2026 | 2:16 AM

ఖమ్మం ఘటనపై నిందితుడికి కఠిన శిక్ష విధించాలి

13-06-2026 12:00 AM

సిద్దిపేట క్రైం, జూన్ 12 : ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశం లో తెలంగాణ గో రక్షక్ దళ్ రాష్ట్ర సభ్యుడు గ్యాదరి రాజారాం మాట్లాడుతూ, ఖమ్మం పట్టణంలో జరిగిన దారుణ ఘటనలో బాధి త బాలికకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.

నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలని కోరారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. సమావేశంలో సిద్దిపేట జిల్లా బజరంగ్ దళ్ సంయోజక్ బైరి మురళి, బోనాల శ్రీనివాస్, పొదిల శ్రీనివాస్, అజయ్, చిరంజీవి పాల్గొన్నారు.