26 May, 2026 | 12:57 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

‘అగ్ని-3’ పరీక్ష విజయవంతం

07-02-2026 12:15 AM

భారత్ అమ్ములపొదిలో మరో క్షిపణి

క్షిపణికి ౩ వేల కిలోమీటర్ల సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే శక్తి

భువనేశ్వర్, ఫిబ్రవరి ౬: భారత రక్షణ రంగ వ్యవస్థ మరో మైలురాయిని అధిగమించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం ‘అగ్ని--3’ క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఇంటర్మీడియట్ రేంజ్ బా లిస్టిక్ క్షిపణి సుమారు 3,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

ఇప్పటికే దేశ అమ్ములపొదిలో ఉన్న ‘అగ్ని--1’ 700 కి.మీ మేర, ‘అగ్ని-2’   2,000 కి.మీ మేర, ‘అగ్ని-4’ 4,000 కి.మీ ‘అగ్ని-5’ 5,000 కి.మీ సుదూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణులు ఉండగా, వీటి సరసన తా జాగా అగ్ని-౩ చేరింది. కేవలం అగ్ని సిరీస్ మాత్రమే కాకుండా, బ్రహ్మోస్ వంటి టాక్టికల్ క్రూయిజ్ క్షిపణులు కూడా భారత సై న్యం బలాన్ని పెంచుతున్నాయి.

30- 300 కిమీ లోపు లక్ష్యాలను బ్రహ్మోస్ చూసుకుం టే, అంతకు మించిన దూరంలోని లక్ష్యాలను అగ్ని క్షిపణులు ఛేదిస్తాయి. అగ్ని--3 కూడా భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రయోగం విజయవంతంపై ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.