11 May, 2026 | 9:53 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

పినపాక నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

01-07-2025 12:00 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

 అశ్వాపురం, జూన్ 30(విజయ క్రాంతి):పినపాక నియోజకవర్గ అభివృద్దే ధ్యేయం అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటే శ్వర్లు అన్నారు. అశ్వాపురం మండలంలో సోమవారం ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు పర్యటించారు . అశ్వాపురం, తురుమల గూడెం గొల్లగూడెం, చింతిర్యాల, సండ్రల బోడు గ్రామ పంచాయితీ లలో రూ. 50 లక్షలతో సీ సీ రోడ్లు ప్రారంభించారు. రూ. 2 కోట్లతో సంద్రలబోడు , చింతిర్యాల రహదారికి శంకుస్తాపన చేశారు. సండ్రల బోడు గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.

అనంతరం బీ సీ హాస్టల్ ను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నానన్నారు. ప్రజలు తమ సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మణిధర్, ఎంపీడీవో ముత్యాలరావు, ఎం ఈ ఓ వీరస్వామి, ఏ పీ ఎం సత్యనారాయణ,ఏ ఈ లు చారి, కిషోర్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, నెల్లిపాక పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి,నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.