l నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
నాగర్కర్నూల్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): తన శేషజీవితం ప్రజాసేవకే అంకితమని, ప్రజామస్యలను పరిష్కరించడమే ధ్యేయమని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వలబాలరాజు, జయపాల్ యాదవ్, మర్రి జనార్దన్రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారని, కానీ ఆయనెప్పుడూ పార్లమెంట్లో ఇక్కడి ప్రజల సమస్యలను ప్రస్తావించలేదన్నారు.
పోతుగంటి భరత్ను కల్వకుర్తి ప్రజలు జడ్పీటీసీగా గెలిపిస్తే ప్రజాసమస్యలను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. తాను ఎన్నికల్లో గెలిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేదాకా కొట్లాడతానన్నారు.