02-02-2026 12:00:00 AM
ముషీరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు సార్వత్రిక విద్యా సాధన లక్ష్యానికి దూరంగా ఉన్నాయని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్ అన్నారు. ఈ మేరకు ఆదివారం దోమలగూడలో టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం 1,28,650 కోట్లు కెటాయించగా, ఈ సంవత్సరం రూ.1,39,289 కోట్లు కేటాయించారన్నారు. అంకెల్లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం బడ్జెట్ దామాషాలో తక్కువగానే ఉంటుందన్నారు.