calender_icon.png 12 June, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు కేంద్రం ఎంతో చేసింది

11-06-2025 12:34:01 AM

  1. ఐఐఎం ఏర్పాటుకు ప్రతిపాదనలు 
  2. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
  3. మోదీ 11 ఏళ్ల పాలనపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లలో తెలంగాణకు ఎంతో చేసిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. రూ.12 లక్షల కోట్ల నిధులను తెలంగాణకు ఇచ్చినట్లు తెలిపారు. రైల్వేలు, రోడ్లు నిర్మించడంతో పాటు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఏర్పాటు, ట్రైబల్ యూనివర్సిటీ, రామప్పకు యునెస్కో గుర్తింపు సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తమ పాలనలో జరిగాయన్నారు.

తెలంగాణకు ఐఐఎం ఇచ్చే ప్రతిపాదన ఉన్నదని వెల్లడించారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన ముగిసిన సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ పేరిట మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. 11 ఏళ్ల పాలన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

11 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అందుకు ప్రధాని మోదీ పరిపాలన ఓ చక్కని మార్గం చూపిందని ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. దేశం ఊహించని విధంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రజలే ప్రథమ ప్రధాన్యంగా తమ పారిపాలన సాగుతోందన్నారు.

దక్షిణాది రాష్ట్రాలు అత్భుతంగా అభివృద్ధి పథంలో ఉంటూ దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేష్‌రెడ్డి, పాల్వాయి హరీష్‌బాబు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నేతలు ఎన్వీ సుభాష్, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.