31-05-2025 07:21:30 PM
కల్లూరు (విజయక్రాంతి): మండల పరిధిలో కోర్లగూడెం గ్రామంలో రైతు వేదికలో ప్రభుత్వ సబ్సిడీ ద్వారా జీలుగు విత్తనాలను సొసైటీ చైర్మన్ కీసర వెంకటేశ్వర రెడ్డి(Society Chairman Keesara Venkateswara Reddy) శనివారం రైతులకు పంపిణీ చేశారు. సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీలుగు కావలిసిన రైతులు పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లు తీసుకోని సొసైటీ కార్యలయంలో నమోదు చేసుకుని 30 కేజీల బ్యాగ్ రూ.2,145 చెల్లించి పొందాలని ఏఈవో సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ పామర్తి కృష్ణ,డైరెక్టర్ లు జోనబోయిన గోపాల్ రావు,వణుకూరి కృష్ణారెడ్డి,నారాయణ పురం మాజీ వార్డు సభ్యులు గొల్లమందల రవికాంత్, పేరువంచ కాంగ్రెస్ నాయకులు కీసర మధుసూదన్ రెడ్డి,సోసైటీ సిబ్బంది సౌజన్య,నవీన్, గ్రామ పెద్దలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.