25-06-2025 12:18:55 AM
మెదక్, జూన్ 24(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చాపర్ ద్వారా మెదక్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ హెలిప్యాడ్కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, ఆర్టీసీ డిఎం, మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్, గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వఅధికారులు పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోడ్డు మార్గంలో ఎల్లారెడ్డికి వెళ్ళారు. మంత్రి వెంట జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు.