19 June, 2026 | 3:33 AM

ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

19-06-2026 02:17 AM

బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ మన్నె క్రిశాంక్

సికింద్రాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): కంటోన్మెంట్ ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు.

గురువారం జక్కులు మహేశ్వర్ రెడ్డి కార్యాలయంలో బిఆర్‌ఎస్ నేతలు బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టి.ఎన్ శ్రీనివాస్, మాజీ బో ర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, అనిత ప్రభాకర్, నలిని కిరణ్, శ్యాం కుమార్, లోకనాథంతో కలిసి బిఆర్‌ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ మన్నె క్రిశాంక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణపై సమాధానం చెప్పాల్సిన అధికార పార్టీలు ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావుపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని సంబంధిత భూములు 1975 నుంచే ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా నమో దై ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

2007లో మహాలక్ష్మి మోటార్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు, 2009లో హైదరాబాద్ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు, 2013లో సంబంధిత అధికారుల లేఖలు ఈ భూములపై ప్రభుత్వ హక్కును స్పష్టంగా నిర్ధారించాయని తెలిపారు.ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభు త్వంపైనే ఉందని పేర్కొన్న డా. క్రిశాంక్, బోయిన్పల్లి మార్కెట్ సమీపంలోని ప్రభుత్వ భూమిలో కాంగ్రెస్ నాయకులే గతంలో 6,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రతిపాదించారని గుర్తు చేశారు.

అలాంటి భూము లను కాపాడి పేదలకు ఇళ్లు నిర్మించాల్సిన ప్రభుత్వం, నేడు ఆ భూముల పరిరక్షణలో విఫలమవు తుండటం దురదృష్టకరమని మన్నె క్రిశాంక్  అన్నారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్, రావుల సతీష్, భాస్కర్ ముదిరాజ్, సత్యనారాయణ,ఎండి యాసిన్, కిరణ్ కుమార్, తెలంగాణఉద్యమకారులు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.