calender_icon.png 24 June, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోడికి ఇల్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

24-06-2025 12:45:16 AM

మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి వజ్రేష్ యాదవ్

ఘట్ కేసర్, జూన్ 23 : ప్రతి అర్హుడికి గృహ సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యే యంగా పెట్టుకుందని టిపిసిసి ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ ప్రాంత లబ్ధిదారులకు మంజూరి అయిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణి కార్యక్రమం సోమవారం ఘట్ కేసర్ పట్టణంలోని మినీ నారాయణ గార్డెన్ లో జరిగింది.

మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బీబ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్ 75 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈపథకం ద్వారా ఇల్లు లేని నిరుపేదలైన ఎంతో మందికి సొంతింటి కల నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మొదటి విడతలో రాణి వారికి రెండవ విడతలో తప్పకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లను అందించడం జరుగుతుందన్నారు. ఈసందర్భంగా ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.

ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, మర్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చేందర్ రెడ్డి, కీసర గుట్ట ఆలయ ధర్మకర్త అమర్, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్ , మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్, సొసైటీ మాజీ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నాగరాజు, సీనియర్ నాయకులు మాధవ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు కందుల కుమార్, కేశవపట్నం ఆంజనేయులు పంతులు, వి.బి. వెంకటనారాయణ, ఖయ్యూం, బొక్క సత్తిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.