24-02-2026 01:41:59 AM
ముకరంపుర, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ లోని కుమ్మర మల్లన్న జాతరకు వెళితే మీరు గుడి లోపటికి రావద్దు అంటూ రజక కులానికి చెందిన భార్యాభర్తలను అగ్రకుల రెడ్డి సామాజిక చెందిన నాయకులు విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా రెండు నెలల పసికందును కాళ్లతో తొక్కి చంపేశారని, ఈ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు.
ఈ మేరకు సోమవారం సీపీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాదాసు సంజీవ్, జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.