27-01-2026 01:22:39 AM
వారి లూటీపై సాక్షాధారాలతో నివేదిక ఇవ్వనున్న గులాబీ పార్టీ
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి) : సింగరేణి కుంభకో ణంపైన నేడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గవర్నర్ జిష్ణుదేవ్వర్మను కలవనున్నారు. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూ రుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల ప్రజాధ నాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని, ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనుంది.
ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ను మంగళవారం కలవాలని నిర్ణయించు కుంది. ఈ భేటీ సందర్భంగా సింగరేణిలో జరిగిన అవినీతికి సంబం ధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు సమర్పించనున్నారు. సింగరేణి వం టి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో ముఖ్యమంత్రితోపాటు వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మం త్రులు నేరుగా భాగస్వాములయ్యారని పార్టీ ఆరోపిస్తోంది.
ఈ వ్యవ హారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పం దించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ఇంతటి భారీ స్కామ్లో భాగస్వాములైన ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు వారి పదవుల్లో కొనసాగే నైతిక, రాజ్యాంగ పరమైన హక్కు లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని గవర్నర్కు తెలియజేయనున్నది. నేడు జరగబోయే ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ముఖ్య ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొని గవర్నర్కు తమ నిరసనను తెలియజేయనున్నారు.