15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

‘సీసీఎల్‌ఏ’లో జాతీయ జెండా ఆవిష్కరణ

27-01-2026 01:21 AM

హైదరాబాద్, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సీసీఎల్‌ఏ ప్రాంగణంలోని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ కార్యాలయాల ముందు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్షులు రాములు టీజీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షులు బాణాల రాంరెడ్డి గారితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు, ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి,టీజీఆర్‌ఎస్‌ఏ జనరల్ సెక్రటరీ భిక్షం, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి మల్లేష్, జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మంజుల, సీసీఎల్‌ఏ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.