30-05-2025 02:31:38 AM
నిర్మల్, మే 29 (విజయక్రాంతి): ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీపై శునకం కాసేపు కునుకు తీసింది. గమనించిన కొం దరు వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ సోషల్ మీడియాలో పెట్టగా, వైరల్గా మారింది. కాగా నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం ధర్మాజీపేటలో గురువారం ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాదైనా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించలేదని, త్వరగా ఎలక్షన్ పెట్టి గ్రామ పంచాయతీలకు ప్రథమ పౌరులను అందించాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ఇలా శునకాలే రాజ్యమేలుతాయంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.