27-06-2025 02:13:03 AM
దాయం రాజీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఝాన్సీ రాజిరెడ్డి
తుంగతుర్తి, జూన్ 26: ప్రభుత్వ బడుల్లోనే ఉపాధ్యాయుల కృషితో ప్రతిభావంతులైన విద్యార్థులు తయారవుతారని దాయం రాజిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఝాన్సీ రాజిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాల సూర్యాపేట జిల్లాలో మండల ఉత్తమ పాఠశాలగా ఎంపికైన సందర్భంగా రాజిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం గ్రామస్తుల సమక్షంలో ఝాన్సీ రాజిరెడ్డి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
అనంతరం సమావేశంలో ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ... మన గ్రామ పాఠశాల జిల్లా స్థాయిలో మండల ఉత్తమ పాఠశాలగా ఎంపిక అవడం ఈ గ్రామ ప్రజలుగా మనకు ఎంతో గర్వకారణం అన్నారు. మండల విద్యాధికారి బోయినీ లింగయ్య, ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరీ వెంకట్రామ నరసమ్మ, విశ్రాంత ఉపాధ్యాయులు సుదగాని రాజయ్య, మాజీ సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ భాషబోయిన వెంకన్న, ఎనగందుల మల్లేష్ నేత, ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.