calender_icon.png 29 June, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోత్కూర్ మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్ ప్రజలతో ముఖాముఖి

27-06-2025 02:15:40 AM

యాదాద్రి భువనగిరి జూన్ 26 ( విజయ క్రాంతి ): 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం రోజు  మోత్కూర్ మున్సిపాలిటీలో యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వార్డు ఆఫీసర్స్ ప్రతి రోజు వార్డులలో పర్యటించి వార్డు ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికి అప్పుడు పరిష్కారం చేయవలిసినదిగా  సూచించారు.

బిల్ కలెక్టర్  వార్డు ఆఫీసర్స్ సమన్వయం చేసుకుంటూ కలిసి వార్డులలో ప్రజలకు అందుబాటులో ఉండవలిసినదిగా ఆ వార్డులలో నీటి సమస్య, లైట్స్, చెత్త ట్రాక్టర్ 2 రోజులకు ఒకసారి వచ్చే విధముగా  చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది  హాజరు రిజిస్టర్ పరిశీలించి చాలా మంది సిబ్బంది రిజిస్టర్ సంతకం చేయకుండా ఉంటే వారికి షోకాజ్ నోటిస్ ఇవ్వమని  కమీషనర్ను ఆదేశించారు.  మున్సిపల్ కమీషనర్  సతీష్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.