27-06-2025 02:15:40 AM
యాదాద్రి భువనగిరి జూన్ 26 ( విజయ క్రాంతి ): 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం రోజు మోత్కూర్ మున్సిపాలిటీలో యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వార్డు ఆఫీసర్స్ ప్రతి రోజు వార్డులలో పర్యటించి వార్డు ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికి అప్పుడు పరిష్కారం చేయవలిసినదిగా సూచించారు.
బిల్ కలెక్టర్ వార్డు ఆఫీసర్స్ సమన్వయం చేసుకుంటూ కలిసి వార్డులలో ప్రజలకు అందుబాటులో ఉండవలిసినదిగా ఆ వార్డులలో నీటి సమస్య, లైట్స్, చెత్త ట్రాక్టర్ 2 రోజులకు ఒకసారి వచ్చే విధముగా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించి చాలా మంది సిబ్బంది రిజిస్టర్ సంతకం చేయకుండా ఉంటే వారికి షోకాజ్ నోటిస్ ఇవ్వమని కమీషనర్ను ఆదేశించారు. మున్సిపల్ కమీషనర్ సతీష్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.