23-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అమలు చేస్తున్నది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రా ల్లో పని దినాలు కుదించి, తాము అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే యథాతథంగా పనిదినాలను కొనసాగిస్తున్నది.
ఎన్నికలున్న రాష్ట్రాల్లో పనిదినాల సంఖ్యను అమా ంతం పెంచింది. తెలంగాణకు గతేడాది 12 కోట్ల పనిదినాలు కేటాయించిన కేంద్రం, ఈ సారి వాటిని 6.5 కోట్లకు కుదించి కూలీల క డుపుకొడుతున్నది. మొత్తంగా దేశవ్యాప్తంగా 45 కోట్ల పనిదినాలను తగ్గించింది. గతేడాది 243.58 కోట్ల పనిదినాలు కేటాయించగా, ఈసారి కేవలం 198.85 కోట్ల పనిదినాలు మాత్రమే కేటాయించిందన్న మాట.
తెలంగాణపై ప్రభావం..
గ్రామీణ ప్రాంతాలకు చెందిన కూలీలకు ఈ పథకం ఆయువుపట్టు. ఉపాధి పనిపై ఆధారపడి తెలంగాణలో ఎక్కువ మంది కూలీలు జీవనం సాగిస్తుంటారు. ఉపాధి పని ద్వారా అందిన కూలితో కుటుంబాలను పోషించుకుంటారు. ప్రభుత్వం వారితో పనిచేయించి సామాజిక ఆస్తులను సృష్టించ వచ్చు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేయవచ్చు.
తెలంగాణకు చెందిన కూలీలకు పథకం ఎంతో ఉపయోగపడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మం ది పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా రు. ఇలాంటి రాష్ట్రంలో కేంద్రం వీలైనన్ని ఎ క్కువ పనిదినాలు పెంచాల్సి ఉండగా, కుదించడం విమర్శలకు తావిస్తున్నది. గత ఏడాది తో పోలిస్తే సగానికి సగం పని దినాలు తగ్గించడం కూలీల్లో ఆందోళన కలిగిస్తున్నది. బడ్జె ట్ కూడా గతేడాది మాదిరి గానే రూ.86 వే ల కోట్లే కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
ఆ రాష్ట్రాల్లో పనిదినాలు ఎక్కువ..
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ర్టమైన గుజరాత్లో ఒక్క పనిదినం తగ్గలేదు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో గతేడాది 5 కోట్ల పనిదినాలు అమలు కాగా, ఈ ఏడాది కూడా అంతే పనిరోజులనే కేటాయించింది. బీహార్లో ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్కడ పని దినాలను భారీగా పెంచింది.
బీహార్కు గతేడాది 17 కోట్ల పనిదినాలు కేటాయించగా, ఈ సారి వాటిని 21 కోట్లకు పెంచింది. అలాగే మహారాష్ట్రకు గత ఏడాది 9.5 కోట్ల పనిదినాలు కేటాయించగా, ఈ ఏడాది 13 కోట్లకు పెంచింది. హర్యానాకు గతేడాది కోటి పనిదినాలు కేటాయించగా, ఈసారి కోటిన్నర పనిదినాలు కేటాయించింది.
తెలంగాణ కూలీలకు అన్యాయం.. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
కేంద్ర ప్రభుత్వం గతేడాది తెలంగాణకు 12 కోట్ల పనిదినాలు కేటాయించి, ఈసారి వాటిని 6.5 కోట్లకు కుదించిందని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణపై కక్షపూరిత వైఖ రి ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. పని దినా ల కుదింపు ఉపాధి కూలీలపై తీవ్రమైన ప్ర భావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
ఉపాధి పని లేకపోతే కూలీలు వలస వెళ్లాల్సి న దుస్థితి ఏర్పడుతుందని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వ హిస్తున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కుమార్ కేంద్రంతో చర్చలు జరపాలని, రాష్ట్రానికి ఎక్కువ పని దినాలు కేటా యించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.