17-04-2025 02:00:10 AM
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎస్జీటీ టీచర్ నియామక వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఒక్కో టీచర్ పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం లోకాయుక్తకు చేరిం ది. అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరు తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త జోరు తిరుపతి బుధవారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుదారుడు సమర్పించిన కొన్ని ఆధారాలను పరిశీలించిన లోకా యుక్త ఈ వ్యవ హారంపై విచారణకు అనుమతించింది. ఈ విషయంపై స్పోర్ట్స్ అథారిటీ సమర్పించిన నివేదికనే విద్యాశాఖ మరోసారి తిప్పిపంపింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 95 పోస్టులుండగా, ఆ క్యాటగిరీలో 8వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ క్యాటగిరీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాధ్యతలను ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి అప్పట్లో అప్పగించింది.
ఇందులో భాగంగానే 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి 95 పోస్టులకుగానూ 33 మందికి అప్పట్లో ఉద్యోగాలిచ్చారు. మిగిలిన 62 పోస్టులను ఓపెన్ కోటాకు మళ్లిం చారు. కానీ పోస్టులివ్వడంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించడంతో తొలుత కిందిస్థాయి అధికారులు అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలిం చారు. జనవరి 3, 4న ఉన్నతాధికారులు మళ్లీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారు. మూడుసార్లు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినా ఒక్క నివేదికనూ బయటపెట్టలేదు.