18 March, 2026 | 1:52 AM

సమాచార హక్కు రక్షణ చట్టం ఐదో రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలి

18-03-2026 12:14 AM

మఠంపల్లి, మార్చి 17 : మండల కేంద్రంలో ఈ నెల 24న ఏర్పాటు చేయనున్న సమాచార హక్కు రక్షణ చట్టం 2005  5వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ అన్నారు.మంగళ వారం మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ  పోస్టల్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ సంస్థలలో  సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం తన బాధ్యత అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలలో జవాబుదారీతనాన్ని పారదర్శకతను పెంచడానికి, అవినీతిని అరికట్టడానికి, పౌరులకు సమాచారాన్ని అందించడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.