29-05-2025 03:13:50 AM
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి): నిజాం రాచరికపాలనకు వ్యతిరేకంగా తన కలంతో ఎదురొడ్డి నిలిచిన ధీరుడు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కొనియాడారు. తెలంగాణ భాషా, యాస, గుర్తింపు కోసం ప్రతాపరెడ్డి చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.
ప్రతాప రెడ్డి కేవలం సాహితీవేత్త మాత్రమే కాదని, గొప్ప స్వాతంత్య్ర పోరాట యోధుడని ప్రశంసించారు. సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతిని పురస్క రించుకుని ‘సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పుర్కసారం 2025’ ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్ సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో జరిగింది.
శాంతా వసంతా ట్రస్ట్ సౌజన్యంతో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్బాబు, విశిష్ట అతిథిగా శాంతా వసంతా ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డి పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి గాను ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, ప్రముఖ రచయిత, పరిశోధకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్కు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించారు.
అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ప్రతాపరెడ్డి రచనలను పుస్తకరూపంలో తీసుకురానున్నామని, ఇం దుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని సాహితీవేత్తలను కోరారు. కేఐ వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. సురవరం ప్రతాపరెడ్డి నిజమైన హీరో అని కొనియాడారు.
కార్యక్రమంలో సీపీఐ జాతీయ మాజీ ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి సాహి త్య వైజయంతి ట్రస్ట్ కార్యదర్శి పుష్పలత, ట్రస్టు సభ్యులు కృష్ణవర్ధన్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రంగారెడ్డి, అనిల్ కుమార్రెడ్డి, కపిల్ పాల్గొన్నారు.