23 June, 2026 | 7:33 PM

Breaking News

మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •  

రాబోయే ఎన్నికలపైనే దృష్టి

07-01-2026 01:16 AM

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పార్టీ నేతలకు సూచించారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ వార్డుల విస్తరణ అంశం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అభ్యంతరాలపై, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఆధ్వర్యం లో చేపట్టనున్న కార్యా చరణపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతమ్ రావు, పార్టీ సీనియర్ నాయకులు ఎన్‌విఎస్ ఎస్ ప్రభాకర్ సహా పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.