16 March, 2026 | 10:19 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

రాబోయే ఎన్నికలపైనే దృష్టి

07-01-2026 01:16 AM

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పార్టీ నేతలకు సూచించారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ వార్డుల విస్తరణ అంశం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అభ్యంతరాలపై, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఆధ్వర్యం లో చేపట్టనున్న కార్యా చరణపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతమ్ రావు, పార్టీ సీనియర్ నాయకులు ఎన్‌విఎస్ ఎస్ ప్రభాకర్ సహా పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.