11-12-2025 01:08:34 AM
తైవాన్ ముందు చూపు, శ్రమించే తత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాం తి) : భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు పెంచుకోగలిగితేనే యువత తాము కోరుకున్న ఉద్యోగాలను పొందగలుగుతారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సూచించా రు. కాలానుగుణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించిన వారే తమ వృత్తులో నిలదొక్కుకోగలుతారన్నారు. బుధవారం టీ ప్రాంగణంలో ‘పాత్ వే టు తైవాన్’ పేరుతో జరిగిన తైవాన్లో ఉద్యోగాల కల్పనకు మొద టి రౌండ్ ఇంటర్వ్యూల కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
టీ- సీఈవో జోగిందర్ తనికెళ్ల, తైవాన్ ప్రభుత్వ సంస్థ టేలెంట్ తైవాన్ ప్రతినిధి ఈడెన్ లియెన్లు మంత్రి సమక్షంలో ఉద్యోగాల కల్పన, ఉన్నత విద్యా కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. తైవాన్కు చెందిన రియల్ టెక్, లాజిటెక్, మీడియాటెక్, విస్ట్రాన్, హిమాక్స్, కౌపాంగ్, ఐటీ ఆర్ఐ దీని కోసం ముందుకొచ్చాయి. ఈ ప్రో గ్రాం ద్వారా ఇక్కడి విద్యార్థులను తైవాన్ కంపెనీలు మొదటి రౌండ్ ప్రాధమిక ఎంపిక ప్ర క్రియ పూర్తి చేసుకుని తదుపరి దశలో తైవాన్ను ఆహ్వానిస్తాయి.
మొదటి విడతగా 20 ఇం జనీరింగ్ కాలేజీల విద్యార్థులు తొలిదశ ఇంటర్వ్యూల కోసం హాజరయ్యారు. తైవాన్ కంపె నీలు ప్రతిభావంతుల వేటలో దేశం మొత్తం మీద తెలంగాణాను ఎంపిక చేసుకున్నందుకు శ్రీధర్బాబు ధన్యవాదాలు తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్ చల్లవర్ తమ పరివర్తన్ ఫండ్ కింద టీ ఫౌండేషన్కు రూ.1.5 కోట్ల నిధులను సమకూర్చనున్నట్టు ప్రకటించారు.
తైవా నీస్ యూనివర్సిటీలు తమ విద్యాసంస్థల ప్రా ముఖ్యతను వివరించే స్టాళ్లను ఏర్పాటు చేశాయి. టీఢూహబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ కల్నల్ టీ.ఎం ప్రవీణ్కుమార్, తైవా న్ టేలెంట్ తైవాన్ సీఈవో జోనాథన్ లియా వో, ప్రతినిధులు టెర్రా లిన్, ఇడెన్ లియెన్, హైదరాబాద్ ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి శివరామకృష్ణ పాల్గొన్నారు.