17 April, 2026 | 12:09 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

పాశం విజయలక్ష్మి వేణుగోపాల్‌కు పెరుగుతున్న ఆదరణ

11-12-2025 01:08 AM
  1. ఒక్క అవకాశం ఇవ్వండి & గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం 

కుటుంబ సభ్యురాలుగా ఆదరిస్తున్న జనం

పెంట్లవెల్లి, డిసెంబర్ 10: పెంట్లవెల్లి మండలం గోపులాపురం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా పాశం విజయలక్ష్మి వేణుగోపాల్ స్థానిక ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం ఓటును అభ్యర్థించేందుకు గ్రామాల్లోకి ప్రజలను కలుస్తున్న సందర్భంగా విశేష ఆదరణ లభిస్తుంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచ్ గా గెలిచిన వెంటనే మొదటి దశలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు వారి మాటను విశ్వసిస్తూ ఆదరిస్తున్నారు. 

గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రజల ముందుకు వచ్చానని, తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ& గోపులాపురం గ్రామంలో మొత్తం 1,650 మంది ఓటర్లు ఉన్నారని, గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అలాగే సరైన రహదారులు లేక గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే, గ్రామ అభివృద్ధిని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని గోపులాపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పాశం విజయలక్ష్మి వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఆమె ప్రచారానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.