6 May, 2026 | 10:16 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలి

08-12-2025 01:29 AM

-రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు

-సదస్సుకు కిషన్‌రెడ్డి హాజరు..

-బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): గ్లోబల్ సమ్మిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన  ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని, తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని బీజేపీ ఆకాంక్షిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అన్ని రాష్ట్రాల సమగ్రాభివృద్ధి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను కేంద్రం రూపొందిస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని ఆయన పేర్కొన్నారు.