31 March, 2026 | 2:37 AM

క్వారీలో పడి మృతిచెందిన చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

31-03-2026 01:08 AM

ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్

సత్తుపల్లి, మార్చి 30 (విజయక్రాంతి): సత్తుపల్లి మండలంలోని ఎన్టీఆర్ కాలనీలో క్వారీలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు.  సోమవారం మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి వారి మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రభుత్వ హాత్యా అని  ఆరోపించారు.

ఊరు సమీపంలో అక్రమంగా క్వారీలకు అనుమతులు ఇచ్చి చిన్నారుల ప్రాణాలను బలి తీసుకోవడం సరైనది కాదన్నారు. ఈ క్వారీలకు అనుమతులు ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రెండు కోట్ల ఎక్స్గ్రేషియాతోపాటు ఆ కుటుంబంలోని సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుంగ హరికృష్ణ. నాయకులు ఉన్నారు.