4 July, 2026 | 9:34 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

పిడుగుపాటుకు మృతిచెందిన గొర్రెలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి

10-08-2025 09:41 AM

మంథని అఖిల భారత యాదవ సంఘం మండల అధ్యక్షుడు పర్షవేణి మోహన్ యాదవ్..

మంథని (విజయక్రాంతి): మంథని మండలం(Manthani Mandal)లోని ఖాన్ సాయిపేటలో శనివారం పిడుగుపాటుతో మృతిచెందిన 15 గొర్రెలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని మంథని అఖిల భారత యాదవ సంఘం మండల అధ్యక్షుడు పర్షవేణి మోహన్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. జీవన్ ఉపాధి కోసం గొర్రెల కాపరి అయిన ఎల్లన్న యాదవ్ మంచిర్యాల జిల్లా బోత్ మండలం నుంచి మేత కోసం మంథని మండలం ఖాన్ సాయిపేట అడివిలోకి వచ్చి గొర్రెలను కాసుకుంటున్నాడని, ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పిడుగుపడి 15 గొర్రెలు మృతి చెందడంతో దాదాపు రెండు లక్షల వరకు నష్టం జరిగిందని మోహన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయిన ఎల్లన్నకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించాలని కోరారు.