10 May, 2026 | 2:50 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

హర్ ఘర్ తిరంగా యాత్రను విజయవంతం చేయాలి

10-08-2025 12:42 PM

బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.

చిట్యాల (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుందని బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్(BJP Chityala Mandal President Burra Venkatesh Goud) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది మహానుభావుల ప్రాణత్యాగ ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు. ఇందుకోసం భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, కావున దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని తెలిపారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మరణించినటువంటి మహాను భావులను ఆదర్శంగా తీసుకొని మనం మన దేశాన్ని ఐకమత్యంగా అభివృద్ధి చేసుకోవాలని చిన్ననాటి నుండే దేశం ధర్మం దేశభక్తి అలవర్చుకోవాలన్నారు.