పేదల ఆరోగ్యానికి అండగా ప్రభుత్వం
మధిర, మే 21(విజయ క్రాంతి): పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని జవ్వాజి ఆనందరావు అన్నారు. గురువారం పట్టణంలోని రేణుక చౌదరి పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన మహాదేవపురానికి చెందిన కలక జ్యోతికి రూ.60,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జవ్వాజి ఆనందరావు మాట్లాడుతూ.... పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.
ఈ చెక్కు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సహకారంతో, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసుతో మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కర్లపూడి అప్పారావు, మండల నాయకులు ఆవుల గురుబ్రహ్మం, జల్లేపల్లి ప్రసాద్, బాధ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






