calender_icon.png 14 May, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి

14-05-2025 01:22:27 AM

అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

భద్రాద్రి కొత్తగూడెం, మే 13 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చే యాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం లక్ష్మీదేవి పల్లి మండలం అనిశెట్టిపల్లి , పాల్వంచ మండలం రెడ్డిగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌరసరఫర శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. త్రాగునీరు టెంట్, తూకపు, తేమ యంత్రాలు, గన్ని బ్యాగ్స్, టార్పాలిన్ లు, అందుబాటులో ఉంచాలన్నారు.

కొనుగోలు చేసిన వెంటనే ధాన్యం కేటాయించిన మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు పలు కీలక సూచనలను చేశారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి, అన్ని రకాల రిజిస్టర్ లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.