బీఆర్ఎస్కు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం
మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రజల ప్రయో జనాలే తమ పార్టీకి ముఖ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటై పదేళ్లవుతున్నా నేటికీ పరిష్కారం కాని అంశాలున్నాయని తెలిపారు. 9, 10వ షెడ్యూల్లో పరిష్కారంకాని సంస్థలను వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలన్నారు. రాష్ట్రాలు విడిపోయిన తరు వాత హైదరాబాద్ నుండి ఆంధ్రప్రజలను వెళ్లగొడుతున్నారని ప్రచారం చేశారని, కానీ, కేసీఆర్ వారిని చక్కగా చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి సూ చించారు. రాజకీయ ప్రయోజనాలను మాకు ముఖ్యం కాదని, కొం దరి ప్రయోజనాల కోసం నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు.






