డివిజన్ పరిధిలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
అధికారులను ఆదేశించిన మేయర్ మూడ్ గణేష్
పాల్వంచ మార్చి 26 (విజయక్రాంతి): కొత్తగూడెం నగరపాలక సంస్థ పాల్వంచలోని 42 డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నగర పాలక సంస్థ మేయర్ మోడ్ గణేష్ అధికారులను ఆదేశించారు. గురువారం 42వ డివిజన్లో విస్తృతంగా ప్రకటించి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు., ప్రధానంగా పారిశుద్ధ్యం డ్రైనేజీ వ్యవస్థలను గాడిలో పెట్టాలన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించి సమస్యలను విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాన్ని పరిశీలించిన రెండు రోజుల్లో భవనాన్ని తొలగించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, 42వ డివిజన్ కార్పొరేటర్ డీ మని, ఏడవ డివిజన్ కార్పొరేటర్ సింధుతపస్వి పాల్గొన్నారు.




