వాటర్ ప్లాంట్లపై అధికారుల దాడులు
27-03-2026 12:00 AM
నిర్మల్, మార్చి ౨౬ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నిబంధనలకు వ్యతిరేకంగా కనీస ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లపై గురువారం మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని ఆదర్శనగర్, ప్రియదర్శనగర్, రామ్నగర్, గాజులపేట్, ఈద్గం చౌరస్తా తదితర ప్రాంతాల్లో దాడులు చేసి నిబంధనలు అతిక్రమించిన దుకాణాలకు జరిమాన విధించారు. నాణ్యమైన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ అధికారులు ఉన్నారు.




