3 July, 2026 | 11:59 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

కేసుల పెండింగే ప్రధాన సమస్య

02-09-2024 12:25 AM

లైంగికదాడుల కేసులపై రాష్ట్రపతి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల కేసులు కోర్టుల్లో సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉండటమే దాడు లు మరింత పెరగటానికి కారణమవుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లా న్యాయస్థానాల రెండు రోజుల జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆదివారం ఆమె ప్రసంగించారు. ‘రేప్‌లాంటి కేసులో కోర్టుతీర్పు రావటానికి తరాలు పడితే.. సామాన్య పౌరుడు అసలు తనకు న్యాయమే జరుగలేదని భావిస్తాడు’ అని పేర్కొన్నారు. గ్రామాల్లో న్యాయవ్యవస్థను పవిత్రంగా భావిస్తారని గుర్తుచేశారు. ‘భగవంతుని సన్నిధిలో న్యాయం ఆలస్యం కావొచ్చేమో కానీ.. అన్యా యం జరుగదనే నమ్మకం ఉంటుంది. కానీ ఎంత ఆలస్యంగా? ఎంతకాలం పడుతుంది? దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. వాయిదాల సంస్కృతిని మార్చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.