16-06-2025 09:38:16 AM
ముగిసిన వేసవి కరాటి శిక్షణ తరగతులు...
కరాటే ప్రదర్శన, సర్టిఫికెట్ల ప్రధానం..
వైరా,విజయక్రాంతి: వేసవిలో గత 14 ఏళ్ళుగా ఆత్మ రక్షణ విద్య అయినా కరాటే విద్యను ఉచితంగా శిక్షణ అందిస్తున్న కరాటే రఘు సేవలు అభినందనీయమని ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు అభినందించారు. వైరా లోని బాలికోన్నత పాఠశాలలో గత 45 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత కరాటే శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం కార్యక్రమానికి రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, రాష్ట్ర మాజీ మార్కుపైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా ఎస్సై రామారావు వైరా మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... కరాటే విద్య మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
గత 14 ఏళ్లుగా కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తూ యువతి యువకుల్లో చైతన్యాన్ని నింపుతూ కరాటే విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించేలా కృషి చేస్తున్న కరాటే రఘును ఈ సందర్భంగా అభినందించారు. 45 రోజులు పాటు శిక్షణ పొందిన విద్యార్థులు కరాటే ప్రదర్శనను ప్రదర్శించారు. వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. అనంతరం ఇటీవల రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపికైన కట్ల రంగారావును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో కరాటే మాస్టర్ గోపతి సైదులు, పణితీ సైదులు సురేషు దినేష్ కిరణ్ శిక్షణ పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.