మిర్యాలగూడను జిల్లాగా చేయాలని ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్కు వినతి
మిర్యాలగూడ, జనవరి 14 : మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆద్వర్యంలో బుదవారం స్థానిక ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పలువురు సమితి సభ్యులు మాట్లాడుతూ మిర్యాలగూడకు జిల్లాగా ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని వనరులు ఉన్నాయన్నారు. అలాగే దీన్ని జిల్లాగా మార్చడం వల్ల చాలా మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తదుపరి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ కు సైతం వినతి పత్రాన్ని అందజేశారు.
జిల్లా ఏర్పాటు ఆవశ్యకత ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నేతలు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్ళపల్లి రవి, బిసి జేఏసీ కోకన్వీనర్ జయరాజు, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, సీనియర్ జర్నలిస్టులు ఖాజా హామీదొద్దిన్, ఏండి అస్లాం,రంగా శ్రీనివాస్, బొంగారాల మట్టయ్య, యాదగిరి తోపాటు బెజ్జం సాయి,సిద్దు నాయక్,నాగేష్, మట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.




