23-06-2025 12:51:48 AM
సీఎం రేవంత్రెడ్డికి పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్ వినతి
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): మహాత్మాజ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయిఫూలే పేరుతో తీసిన సినిమాను ప్రభుత్వం పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రదర్శింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఉన్న అసమానతలను, సాంఘిక దురాచారాలను తొలగించేందుకు ఫూలే చేసి కృషి ఎంతో ఉందని, ఇక సావిత్రిబాయిపూలే మహిళలకు విద్య నేర్పారన్నారు.
సమాజహితం కోసం వారు చేసిన పోరాటం, కృషి జ్యోతిబాఫూలే సినిమాలో కళ్లకు కట్టినట్లు సినిమా దర్శక నిర్మాత చూపించారని తెలిపారు. పూలే ఆశయం మేరకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ జనగణనలో కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని వీహెచ్ గుర్తుచేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని ఆయన కోరారు.