calender_icon.png 23 June, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీకి బ్రహ్మరథం

23-06-2025 12:50:32 AM

- 11 ఏండ్ల మోదీ పాలనలో ఎన్నో విజయాలు

- నాటి పీఎం మన్మోహన్‌సింగ్ పాలనలో పాక్ ఆడిందే ఆట

- బీజేపీ వచ్చాకనే ఉగ్రవాదులకు సరైన బదులు

- వికసిత్ భారత్ సంకల్ప సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): బీజేపీ 11 ఏళ్ల పాలనకు ప్రజ లు బ్రహ్మరథం పట్టారని, ఈ పాలన పదికాలాల పాటు గుర్తుంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. బీజేపీ 11 ఏళ్ల పాలనపై ఆదివారం సికింద్రాబాద్‌లో నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు.

యూపీ ఏ పాలనలో నాటి పీఎం మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సాగిన పాలన.. అది కేవలం రిమోట్ కంట్రోల్ పాలన అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ పాలనలో చంద్రమండలంలో త్రివర్ణ పతాకం ఎగురవేసే స్థాయికి దేశం ఎదిగిందని కొనియాడారు. దేశం ఇప్పుడు ప్రతి రంగంలో అద్భుత ప్రగతి సాధిస్తున్నదని వెల్లడించారు.

మన్మోహన్‌సింగ్ హయాంలో పాకిస్తాన్ వ్యవహార శైలి ‘ఆడిందే ఆట, పాడిందే పాట’ అన్నట్లు సాగేదని, యూపీఏ అలసత్వం కారణంగా ఐఎస్‌ఐ ఏజెంట్లు దేశంలోని అన్ని నగరాల్లో ఏజెంట్లు పాగా వేసే వారని వివరించారు. హైదరాబాద్‌లో బీజేపీ నాయకులు సహా పోలీస్ అధికారులపైనా తీవ్రవాదులు దాడులు చేశారని, దిల్‌సుఖ్ నగర్, గోకుల్ చాట్ సహా పలుచోట్ల బ్లాస్టింగ్‌కు పాల్పడ్డారని గుర్తుచే శారు.

నాడు పాకిస్తాన్ అనుకుంటే భారతదేశంలోని ఏ నగరంలోనైనా బ్లాస్టింగ్ చేయగలిగి ఉండేదన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను ఏమీ చేయలేని దుస్థితిలో ఉండేదని దుయ్యబట్టారు.కానీ, బీజేపీ ప్రభుత్వం అలా కాదని, ఉగ్రవాదం పేరెత్తితే పాకిస్తాన్‌కు వెన్నులో వణుకు పుట్టేలా వ్యవహరిస్తున్నదని కితాబునిచ్చారు.

సర్జికల్ స్ట్రుక్స్, ఎయిర్ స్ట్రుక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి సాహసోపేత ఆపరేషన్లు చేసి ప్రపంచ దేశాలు నివ్వెర పోయేలా చేసిందని కొనియాడారు. యూ పీఏ ప్రభుత్వం కుంభకోణాలమయమని ఆరోపించారు. 11 ఏండ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరకైనా లేదన్నారు.

మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదన్నారు. అమెరికాను తలదన్నేలా దేశంలో జాతీ య రహదారులు రూపుదిద్దుకుంటున్నాయని, ప్రపంచస్థాయి ప్రమాణాలతో రో డ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. 

తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా, సుమారు 32 జిల్లాల రహదారులు జాతీ య రహదారులకు అనుసంధానమయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో ఆధునీకరిస్తున్నామని,  అదే కాంగ్రెస్ హయాంలో ఒక్క టంటే ఒక్క రైల్వే స్టేషన్‌ను కూడా అభివృద్ధికి నోచుకోలేదని గు ర్తుచేశారు.దేశంలో ఏ ఒక్క గ్రామం కూడా విద్యుత్ సౌకర్యం లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో, బీజేపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు తెలిపారు.

విదేశీ ఎగుమతులు, ఐటీ, డిఫెన్స్ ఎగుమతుల్లో భార త్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నదన్నా రు. ప్రపంచంలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని తెలిపారు. ప్రపం చదేశాలు ఏ సమా వేశం నిర్వహించినా, ఇప్పుడు భారత ప్రధానిగా మోదీ ఫ్రంట్‌లైన్‌లో నిలబెడుతున్నాయని కొనియాడారు.

తెలంగాణ ఒక కుటుంబం బారిన పడి బలైంది..

ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, త్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రం ఒక కుటుంబం బారినపడి బలైందని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇప్పుడు లక్షల కోట్ల అప్పుల పాలైందని వాపోయారు.

అవినీతి పాలన, దోపిడీ, కుంభకోణాలు, అహంకారంతో రాష్ట్రం భ్రష్టుపట్టేలా చేశారన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్ పనిచేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలన వద్దనుకొని ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే , వారు ఏడాదిన్నరలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు.

సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడం లేదని, ఇప్పటికీ కాడి కిందపడేశారని దుయ్యబట్టారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఘోరం విఫలమయ్యాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు మేలు జరగాలన్నా, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా.. అది బీజేపీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో కాషాయజెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ కే లక్ష్మణ్, డీకే అరుణ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఏవీఎన్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ నేతలు ఎండల లక్ష్మీనారాయణ, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, రామచందర్‌రావు, విజయ రమణారావు, సీతారాంనాయక్, రాములు పాల్గొన్నారు.

బీజేపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం ఎంపీ ఈటల రాజేందర్ 

బీజేపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరిగే అవినీతికి వ్యతిరేకమని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నాటి సీఎం కేసీఆర్ ఒకప్పుడు ప్రధా ని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తర్వాత అదే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మోదీని పొగిడారని గుర్తుచేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ సర్కార్ కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. గ్రా మాలకు ఇచ్చే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదేనని వివరించారు. స్మార్ట్ సిటీ, అమృత్ నగరాల పేరుతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి  చేస్తుందని తెలిపారు