calender_icon.png 30 December, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల నిర్లక్ష్యమే ప్రజలకు శాపం

30-12-2025 01:01:48 AM

తుంగతుర్తి, డిసెంబర్ 29: తుంగతుర్తిలోని కోర్టు నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు రోడ్డు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, అధికారుల నిర్లక్ష్యమే ప్రజలకు శాపంగా మారిందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నెపర్తి జ్ఞానసుందర్ స్థానికులతో కలిసి సోమవారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజుల తరబడి సంబంధిత కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేయడంతో దుమ్ము, ధూళితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, విజ్ఞప్తి మేరకు తక్షణమే రాష్ట్ర రోడ్డు భవన శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ స్పందించి, అధికారులతో తక్షణమే నూతన సీసీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కటకం కిష్టయ్య, తోట్ల సుధాకర్, ప్రతాప్, కొండరాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.