16 March, 2026 | 11:07 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

జనాభా దామాషా ప్రకారం వార్డులు పెంచాలి

09-01-2026 12:00 AM

ఎంపీటీసీ పోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు దేవి రవీందర్

గజ్వేల్, జనవరి 8 : పెరిగిన జనాభా ప్రకారం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో  వార్డులను పెంచాలని ఎంపీటీసీ పోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు దేవి రవీందర్,  లక్ష్మపూర్ తాజా మాజీ సర్పంచ్ కొలిచేలిమి స్వామి ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం గజ్వేల్  ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చేసిన వార్డుల విభజనతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు.

వార్డులను ఎక్కువ దూరం విస్తరించడంతో ప్రజల సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రజల సూచనలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే అధికారులు ఏకపక్షంగా వార్డుల విభజన చేశారని, పెరిగిన జనాభా ప్రకారం వార్డులను విభజించాలని కోరారు. వారి వెంట దావత్ శ్రీనివాస్ నాగేష్ బి పరశురాములు పి రమేష్ ఎం రాము తదితరులున్నారు.