పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలి
టెక్మాల్, మార్చి 25 : కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వాలిడిషన్ చట్టం 2025 తక్షణమే రద్దు చేయాలని విశ్రాంతి ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులు నా రయణ అన్నారు. బుధవారం ఆ సంఘం ఆద్వర్యంలో టేక్మాల్ త హసీల్దార్ కార్యలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్మార్ తులసీరాంకు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి ఒకటి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన వారిని, ఆ తర్వత విరమణ పొందిన పెన్షనర్లను వేర్వేరుగా విభజించడం సరికదన్నారు. గతంలో ఇస్తూ వచ్చిన వేతన సవరణలు (పిఆర్సీ), కరువు భత్యం (డీఏ) పెంపుదలలు ఇక పై ఉండవని పేర్కోనడం పెన్షనర్ల జీవితలను దెబ్బతీయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి శంకర్ రావు , నర్సింలు, ఆశోకిరెడ్డి, ధనుంజయ్య, రాజు, శివలింగప్ప తదితరులుఉన్నారు.




