9 April, 2026 | 5:09 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

జాతిపిత ఎవరో ప్రజలకు తెలుసు

06-02-2026 12:46 AM

హరీశ్‌రావుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్

 హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : బూతుపిత ఎవరో.. జాతిపిత ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని, ఆ తర్వాత అధికార అహంకారంతో కేసీఆర్ మాట్లాడిన భాష బయటకు తీయమంటావా? అని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.

‘మీ మామకు జాతిపిత అని మీకు మీరు బిరుదు ప్రదానం చేస్తే తెలంగాణ ప్రజలు కూడా చప్పట్లు కొట్టాలా..?’ అని ఆయన  నిలదీశారు.  మీ బండారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్కొక్కటి బయటపెడతున్నారు. మామ మెప్పు కోసం హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపైన నోరు పారేసుకుంటున్నా డు’ అని మండిపడ్డారు.