13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మహిళలకు అండగా ప్రజాపాలన ప్రభుత్వం

20-01-2026 12:30 AM

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

భూత్పూర్/ దేవరకద్ర జనవరి 19: మహిళలకు అండగా ప్రజాపలం ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు, రూ 16 లక్షల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కును మహిళా సంఘాలకు ఎమ్మెల్యే అందజేశారు. మహిళలు ఆర్థికంగా పెరిగినప్పుడే ఆ కుటుంబాలు మరింత బలంగా ఉంటాయని తెలియజేశారు.

ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం తో పాటు దేశం కూడా ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు దేవరకద్ర పట్టణంకు చెందిన బోయ శివశంకర్ నిమ్స్ ఆస్పత్రిలో గుండె సంబంధిత చికిత్స పొందుతున్నారు, అతని వైద్యం నిమిత్తం హైదరాబాద్ లో నిమ్స్ ఆస్పత్రికి సీఎం సహాయ నిధి ద్వారా రూ 3 లక్షల ఎల్‌ఓసి చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులుఉన్నారు.