calender_icon.png 28 June, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఇంటర్మీడియట్, పాఠశాలలో అడ్మిషన్ల శాతం పెంచాలి

28-06-2025 12:28:41 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, జూన్ 27 (విజయ క్రాంతి ) : 2025 - 2026 విద్యా సంవత్సరానికి గాను  ఇంటర్మీడియట్, కళాశాలలో,  ప్రభుత్వ పాఠశాలలో  ఎక్కువగా అడ్మిషన్లు  అయ్యేలా చూడాలని, విద్యార్థిని,విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుకై, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ , ప్రధానోపాధ్యాయులు, మండల ఎడ్యుకేషన్ అధికారులు  నిబద్ధతతో కృషి చేయాలని  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో  జిల్లా ఇంటర్మీడియట్ , జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్  పాల్గొని  మాట్లడుతూ ప్రభుత్వము విద్యకు  అధిక ప్రాధాన్యత కల్పిస్తునందున అదే దిశగా ఉపాధ్యాయులు నాణ్యమైన  విద్యా బోధన చేయాలన్నారు. పిల్లలకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలన్నారు.   

ఈ విద్యా సంవత్సరంలో మన విద్యా వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు రావాలి , ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర స్థాయి లో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.

విద్యార్థులు ఇప్పటి నుండే వార్షిక పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా ప్లాన్ చేసుకోవాలని దానికనుగుంగా బోధన చేయాలన్నారు. వారానికి ఒక్కసారి స్లిప్ టెస్ట్ లు పెట్టాలన్నారు. పరీక్షల సమయానికి పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా  ఇప్పటి నుండే  స్లిప్ టెస్ట్ లు పెడుతూ  వారు చదివే విధానాన్ని గమనిస్తూ ఉండాలి అన్నారు.  విద్యార్థులకు  స్పెషల్ క్లాసులు తీసుకోవాలని సూచించారు. 

మధ్యాహ్నం భోజనం మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ప్రధానోపాధ్యాయులు , కమిటీ సభ్యులు నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు.   ప్రతి విద్యార్థికి ఇప్పటి నుండే అభ్యాస దీపిక ఇవ్వాలని కోరారు. ప్రతి రోజు ప్రేయర్ లో  వ్యక్తిగత శుభ్రత మరియు, డ్రగ్స్ పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థుల విషయంలో వీక్ గా ఉన్న పిల్లలకు హెల్త్ చెకప్ లు చేయించాలన్నారు.

పాఠశాలలలో విద్యార్థులతో మొక్కలు నాటించా లన్నారు.  ఈ కార్యక్రమం లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి  రమణి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, ప్రిన్సిపాల్ లు, ప్రధానోపాధ్యాయులు,మండల ఎడ్యుకేషన్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.i